జనగామలో దారుణం..పునరావాస కేంద్రంలో ఉన్న ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్..!

-

జనగాం, సైదాబాద్ పరిధిలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రంలో ఉన్న బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగింది. జనగాం లో ఒంటిరిగా ఉన్న బాలిక ను ట్రాప్ చేసి అత్యాచారం చేశాడు పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్. తన స్నేహితుడు రాజు తో కలిసి బాలికపై అత్యాచారం చేశాడు. సెప్టెంబర్ 24న బాలికల పునరావాస కేంద్రం నుంచి పారిపోయారు ఇద్దరు బాలికలు. 3 నెలలుగా జనగాంకి చెందిన బాలిక పునరావాస కేంద్రంలో ఉంటోంది. సెప్టెంబర్ 18న పునరావాస కేంద్రంలో చేరిన మరో బాలిక చేరింది. పునరావాసం నుంచి పారిపోయి జనగాం కు చేరుకున్నారు ఇద్దరు బాలికలు.


పాన్ షాప్ నిర్వాహకుడు సాయి దీప్ ఫోన్ తీసుకొని స్నేహితుడు నాగరాజుకు ఫోన్ చేసింది ఓ బాలిక. ఈ తరుణంలోనే… ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నాగరాజు. బస్టాండ్ దగ్గర ఒంటరిగా ఉన్న మరో బాలికను గమనించి ట్రాప్ చేసిన పాన్ షాప్ నిర్వాహకుడు సాయి దీప్… బెకరీ నిర్వాహకుడు రాజు తో కలిసి బాలిక పై అత్యాచారం చేశాడు.

 

25న బస్టాండ్ వద్ద బాలిక ను వదిలేశాడు నాగరాజు. ఇక ఈ బాలిక ను కలిసిన సాయి దీప్ వెంట మరో బాలిక వెళ్లింది. ఇద్దరూ ఒంటరిగా ఉన్న బాలికలు అనే విషయం తెలుసుకున్న అఖిల్, రోహిత్…. ఇద్దరినీ హైదారాబాద్ తీసుకెళ్తాం అని నమ్మించి కారులో ఎక్కించుకున్నారట. ఈ తరుణంలోనే… కారులో అఘాయిత్యానికి పాల్పడ్డారు అఖిల్, రోహిత్. దీంతో తిరిగి పునరావాస కేంద్రం వద్ద వదిలి వెళ్లారు యువకులు. ఈ విషయాన్ని పునరావాస అధికారులకు చెప్పారు బాలికలు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు అధికారులు. ఈ తరుణంలోనే సాయిదీప్, రాజు, నాగరాజు, అఖిల్, రోహిత్ లను అదుపులోకి తీసుకున్న సైదాబాద్ పోలీసులు ..ఐదుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news