చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది – వైఎస్ జగన్

-

తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా సీఎం చంద్రబాబు తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీంకోర్టుకు తెలిసిందని.. అందుకే సుప్రీంకోర్టు ఆయన వేసిన సీట్ ని రద్దు చేసిందని అన్నారు.

తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. కోట్ల మంది హిందువుల మనోభావాల విషయంలో చంద్రబాబు అబద్ధాలు ఆడారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది.. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించిందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు జగన్.

లడ్డులో జంతువుల కొవ్వు వాడారని అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. తిరుమలను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాజకీయ ఉద్దేశాలే ముఖ్యం అని.. తిరుపతి స్వామివారైనా ఆయనకు భక్తి, భయం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news