రాజేంద్ర ప్రసాద్‌ ఇంట విషాదం..రంగంలోకి పవన్‌, ఎన్టీఆర్‌

-

రాజేంద్ర ప్రసాద్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్‌ కూతురు గాయత్రి మరణించారు. ఈ తరుణంలోనే.. రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

The tragedy of Rajendra Prasad house Pawan and NTR enter the arena

శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని ప్రకటన విడుదల చేశారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

అటు ఎన్టీఆర్‌ స్పందిస్తూ..నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news