పవన్ ఇలాక పిఠాపురంలో రూ.17 కోట్లు కుంభకోణం..!

-

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు, బాలికలపై అత్యాచారాలు ఇలా చాలా సంఘటనలు పిఠాపురంలో చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా బాలిక పై అత్యాచారం ఘటన మరిచిపోక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది.


పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురం లో డిఆర్డీఏ, బ్యాంక్ సిబ్బంది రూ.17 కోట్లు  కుంభకోణం చేశారు.  అదే గ్రామానికి చెందిన మహిళలతో దొంగ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి లోన్లు తీసుకున్నారు కేటుగాళ్ళు. రుణాలు కట్టాలని బ్యాంకు సిబ్బంది నుంచి మహిళలకు నోటీసులు పంపించారు. అయితే మహిళల పోర్జరీ సంతకాలతో రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఇందులో బ్యాంకు మేనేజర్ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కోర్టు నోటీసులకు ఏ విధంగా సమాధానం చెప్పాలని గగ్గోలు పడుతున్నారు మహిళలు. జిల్లా కలెక్టర్, మాజీ ఎమ్మెల్యే వర్మ ని కలిసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news