పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు”పై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కి దసరా స్పెషల్

-

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు మూవీ గురించి అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఇటు ప్రభుత్వంలో పాలన చూసుకుంటూనే అటు సినిమాలు చేస్తున్నారు. ఆయన అభిమానుల కోసం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు.

ఈ హరిహర వీరమల్లు చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ సినిమా ఆలస్యం కావడంతో ఆయన తప్పుకున్నారు. నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి కానుంది. ఈ హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కి జోడిగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

బాబీ డియోల్, అనుపమ్ కేర్, పలువురు బాలీవుడ్ స్టార్స్ చిత్రంలో పలు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ని దసరా కానుకగా రివీల్ చేశారు నిర్మాత ఏఎం రత్నం. త్వరలో “బ్యాటిల్ ఆఫ్ ధర్మ” ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడారని తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news