ఎన్నికల వరకే పార్టీలు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

-

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా.. కుల మతాలకు అతీతంగా జరిపే ఈ అలయ్ బలయ్ కార్యక్రమం రాష్ట్రంలోనే గాక దేశంలోనే ఆకర్షణ పొందిన కార్యక్రమమని అన్నారు. దసరా తర్వాత అందరినీ కలుసుకుని శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని దత్తాత్రేయ గత 18 ఏళ్లుగా కల్పిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని ఎన్నికల తర్వాత మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, మన సాంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.  దత్తాత్రేయతో 1980 నుంచి స్నేహం ఉందని.. కిషన్ రెడ్డితో 1990 నుంచి పరిచయం ఉందని మిత్రుత్వంతో పార్టీలు.. అడ్డు రావన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news