AP : స్కూటీపై గంజాయి సప్లయ్.. కారును వెనుక నుంచి ఢీకొట్టి!

-

ఏపీలో గంజాయి మూలాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత నిఘాపెట్టిన అక్రమార్కులు వినూత్న పద్ధతుల్లో దానిని సప్లయ్ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి వివిధ జిల్లాలకే కాకుండా ఏకంగా ఏపీ సరిహద్దులు సైతం దాటి పక్కరాష్ట్రాల్లో కూడా గంజాయి సరఫరా అధికం అవుతోంది.వాహన తనిఖీల్లో పోలీసులకు వందల కేజీల గంజాయి పట్టుబడుతున్నా అక్రమార్కులు అస్సలు తగ్గడం లేదు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఇద్దరు యువకులు స్కూటీపై గంజాయి తరలిస్తున్నారు. అనుమానం రాకుండా బ్యాగులో గంజాయిని పెట్టుకుని కాలేజీ విద్యార్థుల్లా రోడ్డుపై వెళ్తున్నారు. మారుడుమిల్లి నుంచి విజయవాడకు గంజాయిని తీసుకెళ్తున్న క్రమంలో గోకవరం వద్ద ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనుక నుంచి స్కూటీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news