మంత్రి కందుల దుర్గేష్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకులు !

-

Big Shock to Minister Kandula Durgesh: జనసేన పార్టీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్‌ కు ఘోర అవమానం జరిగింది. జనసేన మంత్రి కందుల దుర్గేష్‌ను అడ్డుకున్నారు టీడీపీ నాయకులు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్ పల్లె పండుగ కార్యక్రమంకు వెళ్లారు. ఇక్కడే జనసేన మంత్రి కందుల దుర్గేష్‌ కు ఘోర అవమానం జరిగింది.

Big Shock to Minister Kandula Durgesh

దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన తమకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా జనసేన మంత్రి కందుల దుర్గేష్‌ను అడ్డుకున్నారు టీడీపీ నాయకులు. అయితే.. అక్కడే ఉన్న కొంత మంది పెద్ద లీడర్లు.. ఈ విషయాన్ని కాస్త చల్లారేలా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news