ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. ఈసీకి నోటీసులు..!

-

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు, భారత ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాల హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్ ని ఆదేశించాలని అందులో కోరారు.

ఈ ఉచితాల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందని అభ్యర్ధనలో వెల్లడించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. ఇదే అంశంపై పెడింగ్  ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని సుప్రీం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ హన్సారియా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news