మేయర్ విజయ లక్ష్మి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం..!

-

గాంధీ భవన్ లో మొత్తం రసా బసాగా మారింది. హైదరాబాద్ సమీక్ష లో మేయర్ విజయ లక్ష్మి.. కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది.. వచ్చిన మాక్కూడా గౌరవం ఇవ్వడం లేదు అని డిప్యూటీ మేయర్ శ్రీలత అన్నారు. అయితే డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలు తప్పుపట్టిన ఎంపీ అనిల్… పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను కాపాడుకోవాలి అని పేర్కొన్నారు అనిల్. ఖైరతాబాద్ నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలలోనైనా మాకు ప్రయారిటీ ఇవ్వాలి కదా అని విజయా రెడ్డి తెలిపారు.

అయితే మేము పేరు చెప్పి పదవులు తెచ్చుకోలేదు. సిటీలో కోట్లాది అంతో ఇంతో పార్టీని కాపాడుకున్నం అని విజయారెడ్డి పేర్కొన్నారు. అయితే కుక్కల లెక్క మొరగడం ఎందుకు అని మేయర్ విజయ లక్ష్మి అనడంతో.. సమావేశంలో రభస మొదలయింది. కుక్కలు అనందుకు మేయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news