హోంవర్క్ చేయలేదని పిల్లాడిని చావబాదిన టీచర్.. ఎక్కడంటే?

-

పిల్లలకు చదువు చెప్పించి ప్రయోజకులను చేయాల్సిన టీచర్స్ ఇటీవలి కాలంలో విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఉండాల్సింది సహనం, ఓర్పు.. అల్లరి చేయడం, హోంవర్క్ చేయకపోవడం, చదువు సరిగా అబ్బకపోవడం ఇవన్నీ విద్యార్థుల నుంచి ప్రతీ టీచర్ ఎదుర్కొనే సాధారణ ప్రాబ్లమ్స్. కానీ, ఈ మాత్రం దానికే కొందరు సహనం కోల్పోయి తమ ప్రతాపాన్ని చిన్నారుల మీద తీస్తున్నారు కొందరు టీచర్లు.

తాజాగా హోమ్‌వర్క్ చేయలేదని ఓ పిల్లాడిని టీచర్ చావబాదాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. సతీశ్ అనే సదరు టీచర్ హోం వర్క్ చేయలేదని ఆరో తరగతి విద్యార్థిని చావబాదాడు. తమ బిడ్డ ఒంటిపై దెబ్బలు చూసిన తల్లిదండ్రులు సీసీ ఫుటేజీ ఆధారంగా టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు వారు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news