దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించింది : సీఎం చంద్రబాబు 

-

దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా అమరావతిలో టీడీపీ ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఎందుకు 11 సీట్లకు పరిమితం అయింది. టీడీపీ 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచింది. కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. పార్టీని నమ్ముకున్న కొందరికీ టికెట్లు రాలేదు. ఎన్డీఏ తో పొత్తుతో కూడా పదవులు డిమాండ్ చేయలేదు అని తెలిపారు. ఏ కార్యకర్త తప్పు చేసినా అది పార్టీ పై ప్రభావం తప్పకుండా పడుతుందన్నారు. 

దేశంలో ఎవ్వరికీ రాని విజయం మోడీకి వచ్చింది. దాని వెనుక కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉంది.  ప్రధాని మోడీని చూసి మనం నేర్చుకోవాలి. మోడీ పట్టుదల వల్లనే మూడు సార్లు ప్రధాని అయ్యారని గుర్తు చేశారు.  సంఘటిత శక్తిగా పని చేస్తే.. ప్రజల ఎక్స్ పెక్టేషన్స్ మనం పుల్ ఫిల్ చేయలేము. టీడీపీ ఎప్పుడూ అధికారం కోసం వెంపర్లాడలేదు. రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని తెలిపారు సీఎం చంద్రబాబు. ఏపీలో 65 మంది కొత్త ఎమ్మెల్యేలు.. 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు అని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news