ముంబై ఎయిర్ ఫోర్ట్ లో కాజల్ అగర్వాల్ ఫ్యామిలీతో సూర్య..!

-

తమిళ హీరో సూర్య, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ అనుకోకుండా ముంబై ఎయిర్ ఫోర్టులో కలిశారు.  ఈ సందర్భంగా తన భర్త గౌతమ్ కిచ్లూ, కొడుకు నీల్ కిచ్లూ ను సూర్యకు పరిచయం చేశారు కాజల్ అగర్వాల్. 2012లో మాట్రాన్ చిత్రంలో వీరు కలిసి నటించారు. ఈ సినిమా తెలుగులో బ్రదర్స్ గా విడుదల అయింది. కాజల్ ఫ్యామిలీతో  ఎయిర్ పోర్టులో సూర్య ఫొటో దిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూర్య నటించిన తాజా చిత్రం కంగువ.  పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు సూర్య. ప్రమోషన్లలో భాగంగానే ముంబైకి చేరుకున్నాడు. అదే సమయంలో కాజల్ ఫ్యామిలీతో ఫొటోకి పోజులిచ్చారు. కంగువ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. కాజల్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తోంది. అలాగే మంచు విష్ణు కన్నప్ప మూవీలో కూడా నటిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news