మత విద్వేశాలు రెచ్చగొడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

మత విద్వేశాలు రెచ్చగొడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా  సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని హెచ్చరచించారు.

సంఘ విద్రోహ శక్తులు చెడు ఆలోచనలతో ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయని.. వాటిని దీటుగా ఎదుర్కొని తిప్పి కొడతామన్నారు. శాంతిభద్రతలను విఘాతం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని హెచ్చరించారు. ఇక ఈ సంఘటన పై పోలీసు దర్యాప్తు జరుగుతోందని, పోలీసులపై ఎలాంటి అనుమానాలు వద్దని, విచారణ నిష్పక్షపాతంగా కొనసాగుతుందని, దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news