పెళ్లి పనుల్లో శోభితా-చైతు.. పోస్ట్ వైరల్

-

టాలీవుడ్ హీరో నాగ చైతన్య-హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం వేడుక జరిగింది. తాజాగా ఈ జంట పెళ్లి షురూ అయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. శోభితా ధూళిపాళ్ల గోదుమ రాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభం అయ్యాయి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఎరుపు రంగు, గోదుమ వర్ణం పట్టు చీరలో శోభితా దూళిపాళ్ల మెరిసిపోతూ కనిపించారు. ఈమె చేసిన పోస్ట్ పై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి ఎప్పుడు..? ఎక్కడో చెప్పాలని వరుసగా పోస్ట్ లు చేస్తున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వీరి పెళ్లి అని గతంలోనే ప్రకటించిన విషయం విధితమే. నాగ చైతన్య తండేల్ మూవీ పెళ్లి తరువాత విడుదలవుతుందా..? లేక పెల్లి జరిగాక విడుదలవుతుందా..? అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news