దారి దోపిడీ.. వ్యాపారిని కట్టేసి రూ.50లక్షలు చోరీ!

-

ఇటీవలి రోజుల్లో దారిదోపిడీలు ఎక్కువయ్యాయి. సినిమా రెక్కీ నిర్వహించి సైతం కొందరు దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే కేరళలో కొందరు దుండగులు దారిదోపిడీకి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న వ్యాపారిపై దాడి చేసిన దుండగులు.. కారులోనే ఆ వ్యాపారిని తాళ్లతో కట్టేసి అతడి దగ్గర ఉన్న రూ.50 లక్షలు దొంగిలించుకుని పారిపోయారు.

గమనించిన స్థానికులు బాధిత వ్యాపారిని రక్షించారు. కానీ, అప్పటికే దొంగలు పారిపోవడంతో సదరు వ్యాపారి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు అయ్యింది. ఇదిలాఉంటే కేరళలో దారి దోపిడీ జరగడం ఇదే తొలిసారి కాదు.ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి.గత నెలలో కూడా నేషనల్ రహదారిపై ఇలాంటి ఘటనే జరిగింది. నేషనల్ హైవే -544ను అడ్డాగా చేసుకుని కార్లపై దొంగలు దాడులకు తెగబడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news