ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో రామ్ చరణ్ సందడీ..!

-

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో సినీ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ సందడి చేశారు. తన కొత్త కారు TG 09 2727 రోల్స్ రాయిస్ కారు ను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు. జేటీసీ రమేష్.. చరణ్ కారు రిజిస్ట్రేషన్ కు అవసరమైన సేవలను అందించారు. రామ్ చరణ్ రవాణా శాఖ కార్యాలయానికి వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తన అభిమాన నటుడితో ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. శంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ కియారా అద్వాణి కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జవనరి 09న ఈ చిత్రం విడుదల కానున్నట్టు ఇటీవల ప్రకటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news