నేడు విజయనగరం జిల్లాలో జగన్‌ పర్యటన

-

వైసిపి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాళ అంటే గురువారం రోజున విజయనగరం జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. విజయనగరం జిల్లా గుర్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు జగన్మోహన్ రెడ్డి.

jagan

అనంతరం 11 గంటల ప్రాంతంలో గుర్ల కు చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను… అదే సమయంలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు. అయితే మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా టిడిపి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news