భద్రాద్రి రామయ్య సన్నిధిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

-

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలం రామయ్య సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాచలం దేవస్థానం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఆలయ గర్భగుడిలో సీతారామచంద్రుల వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవర్నర్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత టెంపుల్ చరిత్రను, స్వామివారి గురించి జిష్ణుదేవ్ వర్మకు వివరించారు.

అంతకుముందు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆలయ అర్చకులు, ఈఓ రమాదేవి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు.గవర్నర్ వెంట ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం ఉన్నారు.రాములవారి దర్శన అనంతరం గవర్నర్ ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా అధికారులతో భేటీ నిర్వహించారు. జిల్లాకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు, రాష్ట్ర,జాతీయ స్థాయి అవార్డు గ్రహితలతో ముచ్చటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news