కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్‌కు ఇన్సూరెన్స్ ఇస్తాం : దీపా దాస్ మున్షీ

-

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ శుక్రవారం ఆ పార్టీ నిర్వహించిన సోషల్ మీడియా వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న దాడులను చూసి అస్సలు భయపడవద్దని.. రాహుల్ గాంధీని చూసి ధైర్యం తెచ్చుకోవాలని సూచించారు. త్వరలోనే కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ఇస్తామని ప్రకటించారు.

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాలో ఎటువంటి కంటెంట్ పెట్టాలి, కామెంట్స్ ఏం పెట్టాలి అన్ని గాంధీ భవన్ నుంచి సూచనలు, సలహాలు అందిస్తామన్నారు. నెలలో ఎక్కువ పోస్టులు పెట్టినవారికి పెద్ద ప్రైజ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్రతీ నెలా సోషల్ మీడియాలో టాపర్ల పేర్లు ప్రకటిస్తాం. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారికి స్మార్ట్ కార్డ్స్ ఇస్తాం. నిజం చెప్పాలంటే మనం సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ కన్నా బలహీనంగా ఉన్నాం.

మనం వాళ్ళలాగా కోట్ల రూపాయలు ఖర్చు చేయలేం అందుకే మనం బలహీనంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం లేదు.ప్రతిపక్షం సోషల్ మీడియాలో మనల్ని విమర్శిస్తే మనం నిరాశలో కూరుకుపోతున్నాం.ఆ నిరాశ ఇక వదిలేయాలి.ఈ వర్క్ షాప్‌లో మీకు మనం బలోపేతం కావడానికి అవసరమైన వ్యూహాన్ని పార్టీ పెద్దలు ఇస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news