పెట్రోల్ బంక్‌లో ఫ్యూయల్ ట్యాంక్ వద్ద నిప్పుపెట్టిన ఆకతాయిలు

-

నగరంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.వారి స్వలాభం కోసం తోటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.మద్యం, గంజాయి మత్తులో సమాజానికి హాని చేస్తూ సహచరులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఒక్కోసారి వారి ఆకతాయి పనులు కొందరి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది.

పెట్రోల్ బంకులో బైకులో పెట్రోల్ కొట్టిస్తుండగా.. ఓ యువకుడు ఏకంగా నిప్పుపెట్టాడు. దీంతో మంటలు ఎగిసిపడి స్కూటీ మీద పడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటన హైదరాబాద్ – నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో చోటుచేసుకుంది.

 

ఆ సమయంలో ఆకతాయిలు గంజాయి మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు గంజాయి మత్తులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news