భువనగిరి సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్..!

-

భువనగిరి సబ్ జైలు నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఈనెల 22న రిమాండ్ లో ఖైదీని జైలు సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే ఈ తరుణంలోనే పోలీసుల కళ్లు కప్పి ఆ ఖైదీ అక్కడి నుంచి సైలెంట్ పరార్ అయ్యాడు.

అయితే.. ఈ విషయం ఎక్కడా బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించారు పోలీసులు. అనంతరం రిమాండ్ ఖైదీని తిరిగి పట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా భువనగిరి సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల అజాగ్రత్త పై పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లిన ఖైదీ పై నిరంతరం నిఘా పెట్టాల్సిన సిబ్బంది అసలు ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news