మీ కూతురు అల్లుడు కాలిపోతున్నారు, ఉదయం 4 గంటలకు ఫోన్, అసలు ఎం జరిగింది…?

-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిలాయ్ నగరం అది. ఆ నగరానికి చెందిన రవి, మంజూ ఇద్దరు భార్యా భర్తలు. వీరికి రెండు నెలల క్రితం పుట్టిన ఒక బాబు కూడా ఉన్నాడు. భార్య అంటే రవికి చాలా ఇష్టం, ఆమెను ప్రాణ సమానంగా చూసుకుంటూ వస్తున్నాడు. అయితే ఒక రోజు, రవి బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రాగానే రవి చూసిన ఒక దృశ్యం అతన్ని విచక్షణ కోల్పోయే విధంగా చేసింది.

భార్య మంజూ వేరే యువకుడితో అక్రమసంబంధం పెట్టుకొని ఆయనతో ఒకే మంచం పడుకోవడం చూశాడు. అంతే అతనికి కోపం కట్టలు తెంచుకుంది. వాళ్ళను చంపాలి అనుకున్నాడు రవి. భార్య మంజూ, ప్రియుడుకు కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి టేపు చుట్టి ఇంటికి నిప్పు అంటించాడు రవి. ఆ మంటల వల్ల వచ్చిన పొగతో నెలన్నర వయసు ఉన్న బాబు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

‘‘నా సోదరుడు మంజూ కోసం ఉరి వేసుకున్నాడు. మంజూకు చాలామంది పురుషులతో సంబంధాలున్నాయి, అందుకే ఆమెను చంపాను. ఆమె కుటుంబంలోని ప్రతీ ఒక్కరిని చంపుతాను. అని ఒక లేఖ రాసి పారిపోయాడు. ‘‘మీ కుమార్తె అల్లుడు మంటల్లో కాలిపోతున్నారు, మీకు వీలైతే వారిని రక్షించండి’’ అని ఒక గుర్తు తెలియని వ్యక్తి మంజూ ఫోన్ నుంచి ఆమె తల్లి తండ్రులకు తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేసాడు. వాళ్ళు వచ్చి చూడగా మంటల్లో ముగ్గురు కాలిపోయి ఉన్నారు. దీనితో పోలీసులు అతని కోసం గాలించి రూర్కెలాలో అరెస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news