తమిళనాడులో దారుణం..13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్ !

-

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడు లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ తరుణంలోనే గర్భం దాల్చింది 13 ఏళ్ల బాలిక. ఇక ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో బాలిక తల్లి ఉండిపోయింది. నెల రోజుల పాటు స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వెలుగులోకి ఈ దారుణ సంఘటన తెరపైకి వచ్చింది.

Three teachers gang-raped a 13-year-old student

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ సంఘటనలో ముగ్గురు కామాంధులపై పోక్సో కేసు నమోదు అయింది‌. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అటు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు‌‌‌ చేస్తున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు తమిళనాడులో రక్షణ లేదంటూ బిజెపి అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఘటనలతో స్టాలిన్ సర్కారుకు మరింత సెగ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news