ఆప్ ఓడిపోతుందని మాకు ముందే తెలుసు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక ల్లో బీజేపీ గెలవబోతుందని ఆమ్మ ఆద్మీ పార్టీ ఓడిపోతుందని.. కాంగ్రెస్ దారుణ పరాజయం తప్పదని మాకు తెలుసని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక  వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓడిపోయింది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ కాదని.. ఆ పార్టీ పునాది కూలిపోయిందన్నారు. ఆప్ పార్టీ మళ్లీ బతుకుతుందో లేదో కూడా తెలియదన్నారు. యాంటి కరెప్షన్ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చాకా అనేక కుంభకోణాల్లో మునిగిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పై అవినీతి ఆరోపణలు చేసిన ఆప్ పార్టీనే అనేక స్కామ్ లకు పాల్పడిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడిందని..దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆప్ అధికారం కోల్పోయాయని గుర్తు చేశారు.

బయట ఆమ్ ఆద్మీ నినాదం వినిపించిన ఆప్ నేత కేజ్రివాల్ విలాసవంతమైన శీష్ మహాల్ లో జీవించారన్న సంగతిని ఢిల్లీ ప్రజలు గ్రహించారన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒకప్పుడు ఏ జోక్ లు చెప్పినా ప్రజలు నమ్మేవారని.. ఇప్పుడు నమ్మడం లేదని..ఆయన చెప్పే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనన్న మాటలను చేసి జనం కేటీఆర్ ను ఓ జోకర్ అనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలుపన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news