తెలంగాణ పాఠశాలల్లో తెలుగుని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశం..!

-

తెలంగాణలోని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ ని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ, ఐబీ, సహా ఇతర బోర్డ్ పాఠశాలల్లో, ఇతర బోర్డ్ పాఠశాలలో అమలు చేయాలని పేర్కొంది. తెలుగుని కంపల్సరీ సబ్జెక్ట్ గా అమలు చేసేందుకు పాఠశాల విద్య శాఖకు అనుమతి ఇచ్చింది. తెలుగు భాషని కంపల్సరీ సబ్జెక్ట్ గా పేర్కొంటూ గతం లోనే ఉత్తర్వులు జారీ చేసింది సర్కారు.

అయితే 9వ తరగతి వారికి 2025-26, పదో తరగతికి 2026-27 విద్య సంవత్సరం నుంచి అమలు చేయాలని తెలిపింది. ఇక CBSE స్కూల్స్ లో వెన్నెల సింపుల్ తెలుగు ను బోధించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సింపుల్ తెలుగును అమలు చేయడం వల్ల.. తెలుగు నేర్చుకోవాలి అనుకునేవాళ్లకు.. అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్లకు ఎంతగానో సులువు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news