తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు దారుణంగా పడిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్. ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైంది.అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారు.
గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు.కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటు.చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో ఈ విధ్వంసం. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం.ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే.. రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరం. కేసిఆర్ గారి పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి..
ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా..?’ అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్
ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైంది
అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారు
గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు
కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటుచెత్త… pic.twitter.com/X1CMEvUTER
— KTR (@KTRBRS) March 3, 2025