మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తాం : ఏపీ డీజీపీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు. విజయనగరం జిల్లా పరిధిలో చిన్నారులపై జరిగిన ఆఘాయిత్యాల కేసుల్లో నిందితులకు  మూడు నెలల నుంచి 6 నెలల లోపే శిక్షలు ఖరారు చేయడంతో విజయనగరం పోలీసులను డీజీపీ అభినందించారు. మహిళలు, చిన్నారులపై నేరాలను నివారించడానికి ఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షిస్తారని చెప్పుకొచ్చారు.

ఇక ఉమెన్ అండ్ చైల్డ్ సేప్టీ వింగ్ ను ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అందుబాటులోకి “శక్తి” యాప్ తెచ్చాం.. ఈ శక్తి యాప్ కు పలు అధునాతన ఫీచర్లను జయించడం జరిగింది అన్నారు. ఆపదలో ఉన్న మహిళలు టోల్ ఫ్రీ నంబర్స్ 181, 112, 1098, 1093కు కాల్ చేసినా లేదా మొబైల్లో ఉన్న శక్తి యాప్ లో గల ‘SOS’ మీద నొక్కినా లేదా ఫోనును అటూ, ఇటూ గట్టిగా ఉపినా కంట్రోల్ రూమ్ కి సమాచారం వెళ్తాంది.. నిమిషాల వ్యవధిలోనే శక్తి టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కలిస్తారు అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news