మద్యం దుకాణాలు బంద్‌..

-


ఆదివారం నాడు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలను మూసివేయాలని రాచకొండ సీపీ మహేష్‌ భగత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ నగరంలో బోనాల పండుగ నేపథ్యంలో ఈ నెల 5, 6తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా పండుగను జరుపుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు నిబంధనలు అమల్లోకి ఉంటాయని వెల్లడించారు. అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news