ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు స్మార్ట్‌ఫోన్లు..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ 2020ని నిర్వ‌హిస్తున్న‌ది. ఈ సేల్ సోమ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో యాక్సిస్ బ్యాంక్ కార్డుల‌తో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అలాగే అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ల‌పై ఈ సేల్‌లో ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు. ప‌లు ఫోన్లను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Mobiles bonanza sale started in flipkart

సేల్‌లో భాగంగా శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎ50 స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఐఫోన్ XS స్మార్ట్‌ఫోన్ రూ.54,999 ధ‌రకు ల‌భిస్తోంది. ఇత‌ర ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అద‌న‌పు డిస్కౌంట్‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.26,990 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

సేల్‌లో గూగుల్ పిక్సల్ 3ఎ ఫోన్‌ను కేవ‌లం రూ.27,999 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అసుస్ 6జ‌డ్ స్మార్ట్‌ఫోన్ రూ.26,999 ధ‌ర‌కే ల‌భిస్తున్న‌ది. అలాగే రియ‌ల్‌మి ఎక్స్‌టీ ఫోన్‌ను రూ.14,999 ధ‌ర‌కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9ను రూ.22,999 ధ‌ర‌కు వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news