నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్న మ‌రో అక్కినేని హీరో..!!

-

అక్కినేని మూడోత‌రం హీరో నాగచైతన్య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జోష్ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నాగ‌చైత‌న్య.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ఇక నాగ‌చైత‌న్య‌, వెంక‌టేష్‌ హీరోలుగా న‌టించిన‌ వెంకీమామ సినిమా ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ఇప్పుడు అదే జోష్‌తో ముందుకు సాగుతున్నాడు చైతు. ఇదిలా ఉంటే.. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. దివంగత నాగేశ్వరరావు ఈ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున కూడా నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు.

సొంతంగా ‘మనం ఎంటర్ ప్రైజెస్’ బ్యానర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కుటుంబంలో మూడో తరం కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయబోతున్నాడు. కొత్త టాలెంట్ ను, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఎంకరేజ్ చేసేలా సినిమాలను నిర్మించాలనుకుంటున్నాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ఇప్పటికే రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news