తెలంగాణలో సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు సోలార్ పవర్ అప్పగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇదే విషయంపై మంగళవారం సోలార్ పవర్పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కీలక విషయాలపై భట్టి విక్రమార్క చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సోలార్ పవర్ అప్పగిస్తామని తెలిపారు. వ్యవసాయానికి ఉపయోగపడేలా సోలార్ పవర్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అందించాల్సిందిగా కోరామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.