ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. ఇవాల్టి నుంచే బదిలీలు ఉండనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలోనే నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీలు జరగనున్నాయి. మే 31 నాటికి ఒకే స్టేషన్లో ఐదేళ్లు కంటిన్యూగా పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది.

వీరితో పాటు వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకొనే వారికి కూడా బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జూన్ 3 నుంచి బదిలీలపై నిషేధం తిరిగి అమల్లోకి రానుంది. అయితే ఈ బదిలీల విషయంలో కొంతమందికి… మార్గదర్శకాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒకే చోట ఐదు సంవత్సరాల కంటే పైగా పనిచేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాల్సిందేనని తెలిపింది. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలలో రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా పని చేసిన వారికి ఈ బదిలీలలో ప్రాధాన్యత ఉంటుంది. అంగవైకల్యం ఉన్న ఉద్యోగస్తులను కూడా బదిలీలు చేస్తారు.