తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదం లో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని వివరించారు బట్టి విక్రమార్క. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది మరణించారు.