రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్..3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. 3 నెలల రేషన్ బియ్యం జూన్ నెలలోనే ఇవ్వనుంది ప్రభుత్వం. రానున్న వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార ధాన్యా నిల్వ, రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి జూన్ నెలలో ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నందున కార్డుదారులు డీలర్ వద్ద ఈపాస్ యంత్రంలో మూడుసార్లు బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం 3 నెలల రేషన్ బియ్యం జూన్ నెలలోనే ఇవ్వనుంది ప్రభుత్వం.