KA పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు అప్పులు తీరుతాయని చెప్పారు KA పాల్. ఆస్తుల కోసమే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు భయపెడుతోందని సంచలన ఆరోపణలు చేశారు KA పాల్.

కేటీఆర్ కు ఆస్తంతా ఇవ్వడంతోనే ఈ తగాదా మొదలైనట్లు నేను వింటున్నానన్నారు KA పాల్ . కేసీఆర్ పాలనలో తెలంగాణ కాస్తా అప్పుల తెలంగాణ, అవినీతి తెలంగాణగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరు పార్టీ పెట్టినా ప్రజలెవరూ సపోర్ట్ చేయకూడదని కోరారు KA పాల్. నేను వస్తేనే తెలంగాణకు ఉన్న రూ.10 లక్షల కోట్ల అప్పు తీరుతుందన్నారు.