ఏపీలో కలకలం చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. ఆంధ్ర ప్రదేశ్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. సురేంద్రబాబు బెంగళూరు నుంచి అనంతపురం వస్తుండగా బాగేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొంది.

అయితే, ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేవని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.