ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త అందజేసింది. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లను అందజేయనున్నారు. భూమి ఇచ్చిన రైతులకు మాత్రమే రిటర్నబుల్ ఫ్లాట్లకు నేడు విజయవాడ CRDA కార్యాలయంలో ఈ-లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు.

304 ఫ్లాట్లను 15 గ్రామాలకు చెందిన 119 మంది రైతులకు ర్యాండమ్ సిస్టం ద్వారా కేటాయిస్తారు. ఉదయం 10-1 వరకు కృష్ణాయపాలెం, పెనుమాక, నిడమర్రు, 1,2, నవులూరు 1,2… సాయంత్రం రెండు ఐదు వరకు తుళ్లూరు 1,2, అనంతవరం, వెగలపూడి, నెక్కల్లు, వెంకటపాలెం, మందడం 1,2, శాఖమూరు రైతులకు ఫ్లాట్లు కేటాయిస్తారు. ఇది ఇలా ఉండగా, నేడు ఏపీ లో వన మహోత్సవం ప్రారంభం కానుంది. మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటి మొక్కలు నాటాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.