ఏపీలో డేంజర్ బెల్స్.. నెల్లూరులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నమోదు అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

గూడూరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు, ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు, నెల్లూరు రూరల్కు చెందిన మరో వ్యక్తి, బీవీ నగర్కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారంతా హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.