వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన తరుణంలో… జగన్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. రెడ్బుక్ రాజ్యాంగానికి వైసీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఎమోషనల్ అయ్యారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారన్నారు.

లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని ప్రకటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
రెడ్బుక్ రాజ్యాంగానికి వైయస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి… pic.twitter.com/DQYqumM3Hz
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025