ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గోపినాథ్ ను పరామర్శించారు కేటీఆర్.. గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మాగంటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెల్త్ పై మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానన్నారు. నిన్నటి కంటే ఈరోజు ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉందని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున మాగంటికి అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తాం… గోపీనాథ్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.