ఆంధ్ర ప్రదేశ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి పితృవియోగం కలిగింది. శ్రీనివాస్ తండ్రి పల్లా సింహాచలం (93) ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సింహాచలం నేడు తుది శ్వాస విడిచారు. సింహాచలం మరణ వార్త తెలిసి శ్రీనివాస్ కన్నీటి పర్యాంతం అవుతున్నారు.

సింహాచలం మరణంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాగా, 1994 విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. సింహాచలం మరణ వార్త తెలిసిన అనంతరం శ్రీనివాస్ ని కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు.