ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎంతో జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే సరైన జాగ్రత్తలు తీసుకుంటారో, పూర్తి ఆరోగ్యం బాగుంటుంది మరియు బిడ్డ ఎదుగుదల కూడా సరైన విధంగా ఉంటుంది. సరైన అవగాహన లేకపోవడం వలన కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే, అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు పచ్చి మాంసాన్ని అస్సలు తీసుకోకూడదు. ఎప్పుడైతే పచ్చి మాంసాన్ని తీసుకుంటారో, దానిలో ఉండే సూక్ష్మజీవులు అబార్షన్కు కారణం అవుతాయి. అంతేకాకుండా, పచ్చి కోడిగుడ్లు లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. దీని వలన గర్భిణీ స్త్రీలు వాంతులు, వికారం వంటి లక్షణాలతో బాధపడతారు. అంతేకాకుండా, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోకపోవడం మేలు.
సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో చేపలను తీసుకుంటూ ఉంటారు. అయితే, ప్రెగ్నెన్సీ మొదట్లో పచ్చి చేపలను అస్సలు తినకూడదు. వీటిని తినడం వలన శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ వంటివి చేరతాయి మరియు ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. కనుక వీటిని అస్సలు తీసుకోవద్దు. అదే విధంగా పచ్చి మొలకలు ఆరోగ్యకరమని అందరూ తీసుకుంటూ ఉంటారు. కానీ, వీటిలో ఉండే బ్యాక్టీరియా ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కనుక వీటిని తినకపోవడం మేలు. పచ్చి బొప్పాయిని కూడా గర్భిణీ స్త్రీలు తినకూడదు. వీటివలన గర్భాశయ సంకోచాలు ఎక్కువ అవుతాయి మరియు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఇవి, ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా, పైనాపిల్ను కూడా గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ గర్భాశయ కండరాలను మృదువుగా మార్చుతుంది. దానివలన గర్భాశయ సంకోచాలకు కారణం అవుతుంది. కనుక, పైనాపిల్ను కూడా తినకపోవడమే మేలు. ప్రెగ్నెన్సీ సమయంలో కెఫైన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కూల్డ్రింక్స్, కాఫీ వంటి ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వలన తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.