సీఎం నివాస ప్రాంతంలో 5 నెలల గర్భిణీపై దాడి జరిగింది. మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై దాడి చేశారు దుండగులు. మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేశారు దుండగులు. అటు దంపతులు తీవ్ర గాయాలపాలైయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మాలపల్లిలో నివాసం ఉంటున్న గూడవల్లి ఆనంద్, సునీత దంపతులు, విజయవాడ రైల్వే ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, తమ ద్విచక్ర వాహనాన్ని వెనుకనుండి ఢీకొట్టాడు దుండగుడు.

సునీత గర్భవతిగా ఉండడంతో బండి దిగి అతనితో వాగ్వాదానికి దిగారు భర్త ఆనంద్. మద్యం మత్తులో ఉన్న దుండగుడు సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించగా, చెప్పుతో కొట్టింది మహిళ. దీంతో రెచ్చిపోయి 10 మంది రౌడీ గ్యాంగును పిలిపించి భార్యభర్తలపై దాడి చేయించాడు దుండగుడు. తన భార్య గర్భవతి అని, వదిలేయమని ప్రాధేయపడ్డా కనికరించకుండా బండరాళ్లతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దంపతులు. తమను కాపాడేందుకు వచ్చిన స్థానికులు, వాహనదారులను చంపేస్తామని బెదిరించారని తెలిపింది మహిళ. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దంపతులు.
5 నెలల గర్భవతినని చెప్పినా వినకుండా దాడి చేశారు
– దాడిలో గాయపడ్డ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆవేదన #AndhraPradesh https://t.co/8SNgaMUkgI pic.twitter.com/ILOOj2mQ59
— Telugu Feed (@Telugufeedsite) June 9, 2025