తాళం వేసిన గదిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలుగు చూశాయి. ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన వేములవాడ రవిశంకర్, చంద్రికలకు హిరణ్య (9), లీలసాయి (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు నెలల కిందట పిల్లలను భర్త వద్ద వదిలేసి వెళ్లిపోయింది తల్లి.

నా చావుకు ఎవరు బాధ్యులు కాదని, జీవితంలో ఏమి సాధించలేదని అందుకే నా పిల్లలను చంపి నేను చనిపోతున్నానని లేఖ రాసి వెళ్లిపోయాడు రవిశంకర్. గురువారం ఇంటికి వచ్చిన రవిశంకర్ తండ్రి తలుపులు తెరిచి చూడగా, మంచంపై విగత జీవులుగా కనిపించారు చిన్నారులు. రవిశంకర్ ఫోన్ చివరిగా కృష్ణా నది వద్ద ఆఫ్ అయిందని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.