Telangana: ఎల్లుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు…!

-

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఈనెల 16న మధ్యాహ్నం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. కాగా, మే 22 నుంచి 29 వరకు జరిగిన ఈ పరీక్షలకు 4.2 లక్షల మంది హాజరవడం విశేషం. పరీక్ష ఫలితాలను ముందుగా ఇంటర్ బోర్డ్ సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Telangana Ellundi Inter Supplementary Exam Results
Telangana Ellundi Inter Supplementary Exam Results

పరీక్ష ఫలితాలను తెలుసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్ వస్తుంది. కాగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులు పరీక్ష ఫలితాలు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ పరీక్షలలో పాస్ అయిన విద్యార్థులు తదుపరి తరగతిని కొనసాగించవచ్చు. మళ్లీ ఫెయిల్ అయిన వారు తర్వాత సంవత్సరం పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు. అంటే ఒక సంవత్సరం పాటు ఫెయిల్ అయిన వారికి గ్యాప్ వస్తుంది. ఇదిలా ఉండగా…. అతి త్వరలోనే ఇంటర్ తరగతి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news