విద్యార్థులకు రిలీఫ్..తెలంగాణలో తగ్గిన పుస్తకాల ధరలు

-

తెలంగాణ రాష్ట్రంలో… పాఠశాలలు పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… విద్యార్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో పుస్తకాల ధరలు భారీగా తగ్గాయి. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండో ఏటా పుస్తకాల ధరలు భారీగా తగ్గినట్లు.. లెక్కలు చెబుతున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి ప్రభుత్వం ధరలను స్వల్పంగా తగ్గించింది.

Book prices reduced in Telangana
Book prices reduced in Telangana

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేస్తుండగా… ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తప్పనిసరిగా ప్రభుత్వం తయారుచేసిన సిలబస్ విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్కారు పాఠశాలలకు పుస్తకాలను ప్రభుత్వం పంపించేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పుస్తకాల ధరలు గతంలో కంటే ఇప్పుడు కాస్త తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Latest news