ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ పెంచడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గుంటూరు ప్రాంతంలో రైళ్ల రద్దీ విపరీతంగా ఉన్న కారణంగా రైళ్ల రద్దీని తగ్గించడానికి పేరేచర్ల-మంగళగిరి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు పనులను చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయి.

ఈ కొత్త మార్గంలో వస్తే ప్రయాణికులకు సరుకు రవాణాకు చాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, మరోవైపు ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవేను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ దేవరపల్లి, ఖమ్మం మధ్య జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు నెల నాటికి ఈ పనులు పూర్తవుతాయి. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ హైవేతో ప్రయాణ సమయం పూర్తిగా తగ్గనుంది. దీంతో ప్రయాణికులు సంతోషపడుతున్నారు.