వచ్చే ఎన్నికల్లో నేను, నా కోడలు ఇద్దరం ఎమ్మెల్యేగా పోటీచేస్తాం – ఝాన్సీరెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఝాన్సీ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కోడలు యశస్వి రెడ్డి అలాగే తాను కూడా ఇద్దరం ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని ఝాన్సీ రెడ్డి వెల్లడించారు. పాలకుర్తి నియోజకవర్గం.. లో ఝాన్సీ రెడ్డి అలాగే యశస్విని రెడ్డి ఇద్దరు నిత్యం వార్తల్లో నిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి పెద్ద రాజకీయ నాయకున్ని… ఓడించారు అత్తా కోడళ్ళు.

 

JHANSI
JHANSI

చాలాసార్లు ఝాన్సీ రెడ్డి పోటీ చేసి.. పాలకుర్తి నియోజకవర్గం లో ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిలో దారుణంగా ఓడిపోయారు. కానీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా ప్లాన్ చేసి… ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే ఆమె సక్సెస్ అయి విజయం సాధించారు. అయితే విజయం సాధించిన తర్వాత అత్తా కోడళ్ళ పంచాయతీ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారేది. ఇలాంటి నేపథ్యంలో ఝాన్సీ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో అత్త కోడళ్ళమిద్దరం పోటీ చేస్తామని.. వెల్లడించారు ఝాన్సీ రెడ్డి. అయితే ఏ నియోజకవర్గమని క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఆమె మాత్రం పోటీ చేస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news