నేడు పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు జగన్. భద్రతా కారణాల దృష్ట్యా జగన్ సహా కేవలం వంద మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు.

జగన్ కాన్వాయ్తో పాటు అదనంగా మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే.. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా, పర్యటన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఉదయం 9 గంటలకి బయలుదేరి.. 11 గంటలకు చేరుకోనున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శివనాగ కుటుంబాన్ని పరామర్శించి.. 12 గం. తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు జగన్.